కార్తీక మాసం

కార్తీక మాసం

Monday 23 February 2015

నవయువతా మేలుకో:

                సరైనయువతకు ఇప్పటికి అర్ధం ఐపోయివుంటుంది అసలు రాజకీయం అంటే ఏమిటో.యువతలో సరైన యువత ఏమిటని ఆశ్చర్యపోకండి అలానే అనాలి కూడా,మరి ఈరోజుల్లో ఎంతమంది యువకులు భాద్యతగా ఆలోచించగలుగుతున్నారు,(మహిళల్లోనైనా),చేసే చేతల్లో బాద్యతలేదు,చేసె ఆలోచనల్లో భాద్యతలేదు.ఎదుటివాడు తమను సమిధలుగా వాడుకుంటున్నాడని,తమ విద్యాకాలాన్ని వారి స్వార్ధ ప్రయోజనాలకి వాడుకుంటున్నారని తెలిసికోలేక ఎంత సమయం వృధాచేసికుంటున్నారో కదా. ఐతే రాజకీయాలపై ఆసక్తి ఉండి సేవే ద్యేయంగా పనిచేస్తానికే రాజకీయాల్లోకి వచ్చే యువత ఎంతశాతముంది అంటే లేదనే చెప్పాలి.గ్రూపులు నడపడం,ఎవరోఒకరికి కొమ్ముకాస్తూ,పంచాయితీలుచేస్తూ రాజకీయంగా ఎదుగుతున్న యువతనే నేడు సమాజంలో చూస్తున్నాం.ఇలాంటి కొత్త తరమా మనం కోరుకునేది.ఇప్పటివరకూ జరిగిందేదో జరిగిపోయింది ఇకనుంచైనా కొత్తగా ఆలోచించే నవయువత ప్రస్తుత రాజకీయాలను ప్రక్షాళన చేస్తుందనుకుంటే పాత సీసాలో కొత్త సారాలాగా ఐపోయింది.గమనిస్తూనే వుంది సరైన యువత.అధికారంలోవున్న పార్టీ తన పాలనా కాలంలో అందినంత దండుకోవడం,ఎవరో ఒకరు జైళ్ళ పాలు కావడం,కేసులు నడుస్తూ వుంటాయ్ సంవత్సరాలతరబడి అలా సాగి సాగి ఈలోపు ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తుంది గతపార్టీ చేసిన తప్పులను ఎండగడుతూ,దేశంలో సినీ,ఇతర రంగాలలోవున్న ప్రముఖులని ప్రవేశపెట్టి,జనాలను ఉద్రేకపరచి,అధికారంలోకి రాగానే వారిని అదిచేస్తాం,ఇదిచేస్తాం అంటూ పీఠం ఎక్కుతుంది.తిరిగి షరా మామూలే.మొదట్లో చిత్రాలు చేస్తూ అసలు నిజాయితీకి మేమేరూపాలమంటూ ప్రకటించుకుంటున్నారు.నెమ్మదిగా తమ నిజస్వరూపాలను చూపుతూ నిజాయితీ అనేతొడుగును నెమ్మదిగా వదిలించుకుంటున్నారు.అది స్వచ్చంగా నేడు కానవస్తుంది.ఈ కాలంలోనే గతప్రభుత్వాల కుంభకోణాలను తెరమీదకితెచ్చినట్లు మనకి భ్రమలు కలిగిస్తారు.లోపల జరిగే వాళ్ళ వాళ్ళ లాలూచీలు వారు పడి అలా సాగతీస్తారు.మరలా మామూలే ఈ ప్రభుత్వలోటుపాట్లను ప్రతిపక్షమెండగట్టడం,గలాటాలు సృష్టించడం,దానికీ విద్యార్ధులనే ముందుకుతెస్తున్నాయ్.ఆవేశపరులంటే యువత అని వారికి బాగా నమ్మకం.దాన్ని బాగా వాడుకుంటున్నాయ్ నేటి రాజకీయ పార్టీలు.కానీ విద్యార్ధిలోకమే ఈ చిన్నా విషయాన్ని గమనించటంలేదో లేక ప్రలోభాలకు లొంగో తమ విలువైనకాలాన్ని వృధా చేసికుంటున్నారు. ఎప్పటికి మార్పువస్తుందోనని మాలాంటి పూర్వపు యువత కలత చేందుతుంది.గతంతో పోలిస్తే కొద్దిగా మార్పు వచ్చిందనే చెప్పాలి.దాని పర్యవసానమే ఈమద్య మనం ఓ ప్రభంజనం ద్వారా చూశాం.నీతులు చెప్పటం కాదు అందుకు కడదాకా కట్టుబడి ఉండాలి లేకుంటే జనం వెనక్కి పంపుతారని మనదగ్గర ఓ ప్రాంతీయ పార్టీకి గుణపాఠం చెప్పారు. ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయింది.అలానేఉంటుంది యువత తలుచుకుంటే. 

       చివరిగా అందరిలో ఒకరిగా నేటి యువతకు నేను చెప్పోచ్చేదేమిటంటే మీ విలువైన కాలాన్ని ఎవరికోసం వృధాచేసికోవద్దు,కాలం ఎవరికోసం ఆగదు,మీ భవిష్యత్తు కోసం మీతల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని,వాటికోసం ఎన్నో త్యాగాలు చేశారు.అవి మరిచిపోవద్దు. సమాజంకోసం భాద్యతగా ప్రవర్తించాలి కాదనం,ముందు ఇల్లు చక్కదిద్ది,అనంతరం సమాజం.ఇళ్ళుబాగుంటేనేకదా సమాజం బాగుండేది. బంగారంలాంటి మీ భవిష్యత్తును వాడుకుని ఎవరోకాదు,మన తల్లిదండ్రులు బాగుండాలని కోరుకోండి.వారి కలలను నెరవేర్చండి.అంతేగానీ స్వార్ధపూరిత రాజకీయరొంపిలోకి దిగి మీ భవిష్యత్తు పాడుచేసికోవద్దు.మీరేకనుక తలుచుకుని శ్రద్దపెడితే ఎన్నో అద్భుతాలు సృష్టించగలరు.దానికోసమే భావి లోకం ఎదురుచూస్తుంది.

      సర్వేజనా సుఖినోభవంతు.     

Monday 16 February 2015

శివోహం:

           బ్లాగు మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.ఆ పరమేశ్వరుని దయ అందరికీ కలగాలని,శాంతి,సౌభాగ్యాలతో అందరూ వర్ధిల్లాలని కాంక్షిస్తూ...

Thursday 12 February 2015

ఏమైపోయినవా పత్రికలు:

        మా చిన్నతనంలో అమ్మ,నాన్న చదివే ఆంద్ర సచిత్ర వార పత్రిక,అమ్మ,అమ్మ స్నేహితులు చదివే వనితా జ్యోతి అనే మహిళా మాస పత్రిక,మా పిల్లల కోసం బాలమిత్ర,బాల జ్యోతి,సినిమాలకు సంబందించిన విజయ చిత్ర,జ్యోతిచిత్ర,శివరంజని వంటి పత్రికలేమై పొయాయ్.దయచేసి తెలిస్తే ఎవరైనా తెలుపగలరు.వనితా జ్యోతి నేను పదవతరగతికి వచ్చేవరకూ వుంది.చదివానుకూడా.మంచి మంచి అంశాలుండేవి.పుస్తకం కూడా చాలా బాగుండేది.తరువాత చదువులు,పెళ్ళిళ్ళులో పడి ఈ పుస్తకాలగురించి తెలియలేదు.ఇప్పుడు కాస్త వీలుచిక్కి చదువుదామనుకుంటే మంచి పత్రికలేవీ లేవు.వున్నవంత బాగుండలేదు.ఆంద్రభూమి లో కూడా మల్లిక్ గారి జోకులు,హాస్యభరితమైన ధారావాహికలు వచ్చేవి.అవి కూడా బాగావుండేవి.తరువాత పల్లకి,రచన అనే పుస్తకాలు కూడా చదివాను.బాగుండేవి.తరువాత అవీ కనబడ లేదు.అవేవుంటే ఈ టివిలలో చెత్త ధారవాహికలు చూడాల్సిన భాదవుండేది కాదు.కాస్త పత్రికా పఠనంవలన గృహిణులకి ఙానం పెరిగేది.అదీ లేకుండాపోవటంతో పఠనాశక్తి తగ్గిపోయింది.కళ్ళుమాత్రం ఆ టివికి అతికిస్తున్నాం.ఎన్నాళ్ళు చూస్తాం అవి మాత్రం.ఎంతైనా పత్రికలకు సాటి మరే రంగం లేదని నాకనిపిస్తుంది.

     సరే ఎటో ఎటో వెళ్ళి పోతున్నా.చెప్పదలచుకున్నది,ఆశగా ఎదురుచూసేది మరలా అలాటి సాహిత్యాలతో కూడిన పత్రికలు వచ్చి మరలా పాత రోజులు రావాలని.ఎందుకంటే "పాతవెప్పుడూ బంగారమే".వాటి ద్వారానైనా విలువలకు ప్రాణం పోసినట్లౌతుందని. దయచేసి విలువలగురించి వ్రాస్తే ఎవరు చదువుతారని అనవద్దు.చదివే వారున్నారు,వుంటారు ఎప్పటికీ.పాలల్లో నీళ్ళు కలిసినంత మాత్రాన పాలన్నీ నీళ్ళైపోవుగా.పాలు పాలే,నీళ్ళు నీళ్ళే.ఏమంటారు?.  

Tuesday 10 February 2015

కరిగిపోయే కాలం:

       ఈ సృష్టిలో కాలమంత కాటిన్యమైనది మరొకటి లేదనిపిస్తుంది.అనిపిస్తుందేమిటి..అదే నిజం.కాదని ఎవరినైనా అనమనండి...అదే నిజం.మనం చదువుకునేదశలో గురువులు చెప్తూ ఉండేవారు,"కాలాన్ని వృధా చేసికోకండి,ధనం పోతే సంపాదిమంచుకోవచ్చు,కానీ కాలం తిరిగి రాదని".అప్పుడు ఆ దశలో చాలా తేలికగా తీసికుంటాం.మనమూ ఒక్క జీవితంలో ఓ దశకి చేరుకున్నాక అనిపిస్తూ ఉంటుంది"అప్పుడు అలా చేసిఉండల్సిందికాదు,ఇలాచేయవలసింది అని".కానీ ఆ  క్షణాలు మళ్ళీ రావుగా. ప్రతీ మనిషీ ఏదో ఒక క్షణంలో వాళ్ళు బయటపడినా,పడకపోయినా,ఏదో ఒక సంధర్భంలో ఇలా అనుకోకుండా వుంటున్నారా అంటే?లేరనే చెప్పాలి.

      కాలం,వాయిదా అనేవి బద్ద శత్రువులు.ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నవి.దేన్ని ఎప్పుడు చేయాలో అప్పుడే ముగించాలి.కాలం,క్రియ అనేవి మంచి మిత్రులు.చూడండి మనందరివిషయంలోనే చూద్దాం,అన్నీ పనులు వాయిదా వేయకపోయినా ఎప్పుడో ఒకపనినైనా చేయవలసిన సమయంలో చేసిఉంటాం.దానిని తిరిగి మనం చూడవలసిన అవసరం ఉండదు.అలా కాకుండా వాయిదావెస్తూ పోతున్న పనులు రాకాశిలా పెరిగి మనలను మనశ్శాంతి లేకుండా అశాంతికి గురిచేస్తుంది.కూర్చున్నా అదేద్యాస,నిల్చున్నా అదే ద్యాస.దేనిమీదా ఏకాగ్రత కుదరదు.ఏపనిమీద సైగా దృష్టి పెట్టలేము.దేనినీ మనస్పూర్తిగా అస్వాదించలేము.పోనీ వాయిదావేసిన పనిసంగతి ఇప్పుడు చూద్దామంటే పరిస్తితులు అనుకూలంగా ఉండకపోవచ్చు.దీనితో పక్కనవారిపై అసహనం,అక్రోశం,ఆగ్రహం(పుణ్యానికి వచ్చేదేగా).ఇన్నిటికి కారణం కాలం విలువనెరుగకపోవడం.ఒక తరం నుండీ మరో తరం దీనినే వారసత్వంగా తీసికుంటున్నామేగానీ,ఏతరమూ అసలు విస్మరించిన దానిని సరిదిద్దు కోవటంలేదు.ఇది మానవ నిర్లక్ష్యమా?లేక కాలం యొక్క కాటిన్యమా?అనిపిస్తుంది.విద్య,విఙానంలో అభివృద్ధి సాధించినా ఈ ఒక్క విషయంలో మనిషి తప్పటడుగు వేయకుండా ఉండలేకపోతున్నాడు.

     నా సంగతే చూద్దాం.నేను ఏడవతరగతి చదువుకునే రోజుల్లో మా ప్రధానాచార్యులు రోజూ ప్రార్ధన సమయంలో ఒక మంచి మాట చెప్పే వారు.అందులో ఆయన చెప్పిన మాటల్లో నాకు బాగా గుర్తుండి పోయినది,నేను ఇప్పటికీ ఆచరించేది చెప్తున్నా,"నేటి పని నేడె".నాకు చాలా ఇష్టమైన వ్యాక్య.ఆ ఒక్క మాట నాటి నుండీ నేటి వరకూ నా పరిది వరకూ ఆచరిస్తూ వచ్చా.అబ్బో ఐతే మీకు ఎటువంటీ ఇబ్బందులూ వుండి వుండకపోవచ్చు అనుకోకండి.అనుకుంటే పప్పులో కాలేసినట్లే.మనం పాటిస్తేనే చాలదు.మన చుట్టూ వాతావరణం కూడా అందుకు సహకరించాలి.ఏ ఒక్కరి సహకారం లేకున్నా తిరిగి మామూలే.కానీ గృహిణిగా నా పనులు మాత్రం ఎప్పటివప్పుడే చేసి ఉంచుకోవటంలో సఫలీకృతురాలినే.దేనికీ ఎవరినీ నిరీక్షించనీయను.తగుసమయంలో,వీలైతే ముందే పూర్తిచేస్తా.కానీ ఇవే కాదుగా జీవితానికి.ఇంతకంటే ముక్యమైన కార్యాలు ఎన్నో వుంటాయ్.వాటిలో ముందుంటే గురువుగారు చెప్పినదానిని నూటికి నూరు శాతం నేను ఆచరించాను అనే సంతృప్తి ఉంటుంది.ఇవన్నీ కాలమే ఆడిస్తుంది.ఇవన్నీ ఆలోచించుకుంటూ వుండేలోపు కరిగిపోతూనే ఉంటుంది కాలం.లక్ష్యం ప్రశ్నార్ధకంగా మనముందు నిలబడుతుంది.అప్పుడు ఆదుర్ధా పడి ఏమీ చేయలేము,చేసినా సంతృప్తికరంగా చేయలేం. కనుక ఎప్పటి పనిని,అప్పుడే ముగించు కోవటం ఉత్తమం.కాలం ఎవరికీ చుట్టం కాదు.ఎవరికోసం ఆగదు.అది చూపించే చిత్రాలు చూడటానికి చివరికి మనిషికి ఓపిక కూడా ఉండదు.చెప్పానుగా కాలానికున్నంత కాటిన్యం ఎవరికీ ఉండదు. నిర్ధక్షిణ్యంగా జీవితాలు జీవితాలను చిదిమేస్తుంది.ఆనక సరిదిద్దుకుందామనుకున్నా దారే దొరకదు.పరిష్కారం దొరకదు.

    ఇంతకూ నేను చెప్పోచ్చేదేమిటంటే మిత్రులారా(నా పోస్టు చదివిన వారు)ఎంతోమంది చెప్పారు కదా మీరెంత,మీరెవరు అనుకోకుండా,కాలం విలువ గుర్తెరగండి.ఇది ఏ విధ్యార్ధులకో చెప్తున్నాననుకోకండి.అందరం అన్ని వయసుల వారం,ఎవరం వారి వారి పనులను ఎప్పుడు పూర్తి చేయాలో అప్పుడే పూర్తి చేద్దాం.ఆనక పరుగులు తీయలేం.మొదలు "వాయిదా వేయటాన్ని" తీసేద్దాం.కాలమనే రక్కసి కోరలకు సాద్యమైనతవరకూ దొరక్కుండా తప్పించుకోవటానికి ప్రయత్నిద్దాం. సాద్యంకాకపోయినా ఓపిక ఉన్న సమయంలోనే మన భాద్యతలు పూర్తిచేసి ఆ తరువాత మీకు తెలిసిందే కదా తామరాకు,నీటి బొట్టు.అలా జారి పోవాలి.అదే ఈరోజు మీకు చెప్పాలనిపించింది.అందరివిషయంలో ఇలాగే జరగాలని కోరుకుందాం.