కార్తీక మాసం

కార్తీక మాసం

Tuesday 25 November 2014

శ్రీ శైల యాత్రావిశేషాలు:

                          

                                                             

      ప్రతీ సంవత్సరం కార్తీకమాసం నెలంతా ఉపవాసాలతో జరుపుకునే నేను ఈ సంవత్సరం ఉండగలనో లేనో అనుకుని ముందురోజే స్వామికి ఉండగలిగినన్ని రోజులుంటా దీక్షగా ఉంటా తండ్రీ ఆతరువాత ఒక నమస్కారంతో సరిపెడతానని మొక్కేసుకున్న. ఆ పరమేశ్వరుడు ఇంకా నామొర ఆలకించి ఈ సంవత్సరం మరింత శక్తినిచ్చాడు. కాకుంటే ఒకే నెలలో అన్నవరం,ఎప్పటినుండో కార్తీక మాసంలోనే శ్రీ శైల శిఖర ధర్శనం చేసికోవాలనే నా చిరకాల కోరిక నెరవేరడమేమిటి. అదీ నేను మొదటిసారి శ్రీ శైలం వెళ్ళటం. భగవంతుని కృపవుంటే బొందితో కైలాసంకూడా సాద్యమేననటానికి నా ఈ యాత్రలే సాక్ష్యం. 
        
      వారు అడిగినవెంటనే చూద్దాంలే ,నాకు పని హడావుడి లేకుంటే అన్నారు. 23వ తారీఖు వచ్చిందంటే ఆయనసలు దొరకరు. అన్నవరం కూడా దేవుని దయవలన ఈ సంవత్సరం పౌర్ణమికి వెళ్ళాం. చక్కగా ప్రాతఃకాలమే వ్రతం చేసికుని,వారికి బస్ లోనే అర్జీ పెట్టేశా. ఎప్పటినుండొ ఉన్న శ్రీ శైల దర్శనం కోసం. అందుకు వారు పై విధంగా నన్ను ఆశ నిరాశల మద్య కొన్ని రోజులు ఊగేలా చేశారు. ఇక ఈ సంవత్సరం కూడా నాకాప్రాప్తంలేదులే అనుకుంటుండగా నేను హైదరాబాదు వెళుతున్నా వస్తావా ఒక్కదానివేఎందుకుండటం అన్నారు. మళ్ళీ మనసులో కోరిక బయటపెడుతూ శ్రీ శైలం తీసికువెళతానంటే వస్తా నన్నా. సరే ఒక్కరోజుందికదా. 23తో చివరిరోజు కదా. సరేనా   చూస్తా నన్నారు. చూస్తానంటేకాదు,తీసికువెళతానంటే నేను దీపాలు కూడ అక్కడేవెలిగించుకునే ఏర్పాట్లు చేసికుంటాను అన్నా. సరే అన్నారు. పోయిన సంవత్సరం హరిద్వార్ లో దీపాలు వెలిగించుకున్నాను. చాలా మంచిగా అనిపించింది. అనుకున్నదే తడవుగా టికెట్ట్స్ బుక్ చేసి,రూం కూడా బుక్ చేశారు.  

     పోయిన గురువారం నాడంకుంటా అనుకోకుండా "తేనె చినుకులు" బ్లాగు చూడటం జరిగింది. ఈ సం లోనే జనవరిలో వారు వెళ్ళారట.  విశేషాలతో అక్కడ చూడవలసిన ప్రదేశాలు,సౌకర్యాలగురించి వ్రాసారు. అంతా పరమేశ్వరుని సహకారం అనుకుని వారికి దానికి సంబందించిన సమాచారమంతా ఇచ్చి,శుక్రవారం బయలుదేరి, శనివారం హైదరాబాదులో మా పాపని సాయంత్రం కలుసుకుని రాత్రికి 9.30 బస్సుకి బయలుదేరాము.  

    మల్లన్నని ఎపుడెపుడు చూస్తానా అన్న ఆత్రంతో నాకసలు నిద్ర పట్ట లేదు . మేమెక్కిన బస్సు కాక మరో బస్సుకే రాత్రి వేళలో నల్లమల అడవిలొ ప్రయాణించే పర్మిషన్ ఉందట. అలా రాత్రంతా ప్రయాణించి తెల్లవారుజామున 4 గంటలకు శ్రీ శైలం చేరుకున్నం. మద్యలో అడవిలో జంతువులగురించి డ్రైవర్ చాలా కబుర్లు చెపుతున్నాడు. అందుకు కూడా నాకు నిద్ర రాలేదు. నక్కలను, దుప్పులు చూసాను. పగలు కనబడతాయో లేదొ తెలియదు. శ్రీ శైలం డాం మాత్రం విద్యుత్ వెల్లుగులతో ఎంత మనోహరంగా ఉందో. వెంటనే నాకు "కృష్ణవేణి"  సినిమాలో నాకూ ఇష్టమైన పాట "శ్రీ శైలా మల్లాయ్యా,దైవమే నీవయ్యా, శ్రీ భ్రమరాంభతో వెలిసిన జంగమయ్యా" గుర్తుకు వచ్చింది. హం చేసుకుంటూ ఉన్నా. అందులో సాహిత్యమంతా నేను దృశ్యరూపలో చూశా. చాలా చాలా అందమైన ప్రకృతి,దాన్ని వర్ణించడం మాటల్లో చేతకావటం లేదు. వెంటనే మల్లికార్జున సదన్ లో మా పనులన్నీ ముగించుకుని దర్శనానికి వెళ్ళిపోయాం. నాకు ప్రాతఃకాల పూజ ఇష్టం. ఇంటిలో కూడా 5 కల్లా దీపారాధన ఐపోవాలి.6కల్లా అన్నీ చదువుకోటం కూడా పూర్తవుతుంది. ఆ టైం ఐతే ఎవరీ వలన నాకు ఇబ్బంది వుండదు. ప్రశాంతంగా వుంటుంది. అందుకే ఆ టైం అంటే ఇష్టం. దర్శనం కూడా త్వరగా పూర్తైంది. బయటకివచ్చి, చాగంటి కోటేశ్వర రావుగారు చెప్పిన ప్రదేశాలన్నీ చూసి, అరటి దొప్పలో దీపాలు వెలిగించా. అక్కడే ఒకామె ఉసిరి కాయలిచ్చారు. ఉసిరి దీపాలుకూడా జమ్మికింద వెలిగించా. బయట లక్ష వత్తులు దొరికాయి. ఒక మూకుడులో నూనెతో తడిపిన వత్తులు,పసుపు,కుంకుమ,అగరుబత్తి,కర్పూరం,ఆవునెయ్యికొని ఉసిరిచెట్టులింద లక్ష వత్తులు వెలిగించా. ఈలోపు ఒకామె చెప్పారు జిల్లేడు ఆకులొకూడా దీపం వెలిగిస్తే మంచిదని. పాపం తనే అవన్నీ ఇచ్చారు. అసలు నేననుకున్నా ఈ మాసంలో ఒకసారైనా స్వామికి జిల్లేడు మాల వేయాలని.స్వామి ఆమె ద్వారా గుర్తుకుతెప్పించారనిపించింది. అదీ పూర్తిచేసి గోమాత దర్శనం,గోప్రదక్షిణ చేశాము. బయటకివచ్చి కాస్త అల్పాహారం చేసి సాక్షి గణపతి వద్దకువెళ్ళేప్రయత్నంలో ఉండగా బస్ వచ్చింది . 12 గంటలకల్లా చూడవలసిన ప్రదేశాలన్నీ చూపించి తిరిగి గుడి వద్ద దింపుతనన్నారు. మాకు తిరిగి 4 గంటలకు హైదరాబాదుకు బస్. అందుకే టైం కూడా చూసుకుంటూ బస్లోనే బయలు దేరాం.

     సాక్షి గణపతి టెంపుల్ దర్శనం జరిగింది,మా గోత్రనామాలతో పూజ చేపించుకుని బయలుదేరి పాలధార,పంచధార, పాతాళగంగ,శ్రీ శైలం డాం,ఆదిశంకరాచార్యులవారు తపస్సు చేసిన పీఠం,శిఖర దర్శనం అన్నీ ముగించుకుని,రోప్వే లో కిందకి దిగి నదిలొకూడా దీపాలొదలి బోట్ షికారుకెళ్ళాం. 2గంటలకల్లా పైకి వచ్చి త్రిశూల్ లో భోజనం చేసాము. రూంకొచ్చి కొంచెం రీఫ్రెషై బస్టాండుకి వచ్చికూర్చున్నాం. ఒక అరగంటలో బస్ వచ్చింది. ఎక్కికూర్చున్నవెంటనే నిద్ర ముంచుకువచ్చేసింది. ఒక అరగంట తరువాత లేచేసరికి బస్ బయలుదేరలేదు. నాకు ఒకటే కంగారు. రాత్రికి హైదరాబాదునుండి మాకు కొత్తగూడెం రిసర్వేషన్ ఐపోయింది. ట్రైన్  మిస్ అవుతామేమోనని. బస్ వాడు త్వరగానే తెచ్చాడు కానీ మాకంగారు మాది కదా. ఓ అరగంట లేటుగానే బస్ స్టాండుకు చేరు కున్నాం. ఆటోలో సికిందరాబాద్ స్టేషంకి కరెక్ట్ టైంకే చేరుకుని మా సీట్లో కూచునే వరకూ కొంచెం కంగారౌ పడ్డా. ఆయనకేమీలేదులెండి, ఎప్పుడూ ప్రయాణాలు చేస్తారు కనుక.నాకే బయటకు వస్తే మళ్ళీ అనుకున్న సమయానికి ఇంటికి చేరిపోవాలి. లేకుంటే మనసు మనసులో వుండదు. ఎందుకటారా?ఎమో తెలియదు. 

     అలా శివయ్య,సత్యదేవులిరువురు,వారివద్దకు రప్పించుకోవటానికి ఓపికనిచ్చి సహకరించారు. నేను వ్రాసినదానిలో నా ప్రయత్నమెంత?భగవంతుని దయ ఎంత?సంకల్పం ఉంటే దానికి భవతుని సహకారం తప్పకుండా ఉంటుందనటానికి ఈ సం..నా యాత్రలే తార్ఖాణాలు. ఒక్క చిన్న అసంతృప్తి మాత్రమే కలిగిందీ యాత్రలో. అది ఇష్టకామేశ్వరి ఆలయానికి సమయాబావంవలన వెళ్ళలేకపోయాను. అమ్మ ఈసారైనా కరుణిస్తుందేమో చూడాలి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారుగా.ముందునాటికి అదికూడా ప్రసాదించమని ఆ అమ్మను కోరుకుంటాను.  
             ఇవండీ నా శ్రీ శైల యాత్రా విశేషాలు. దోషాలుంటే మన్నించగలరు.తెలియని విషయాలు పెద్దలు తెలియచేయగలరు.ఉంటాను.మళ్ళీ మరో టపాతో కలుస్తా.                                                                                                                                                                                                                     

No comments:

Post a Comment