కార్తీక మాసం

కార్తీక మాసం

Friday 7 November 2014

   

          ఇప్పుడే ఒకచోట చదివా 'స్వచ్ భారట్ గురించి. తీరిక దొరకక వ్రాయలేదుగాని, మొన్న ఒకరోజు ఎప్పుడొ ఎందుకండి 3వ తారీకు విజయవాడవెళ్ళా. బస్టాండులో దిగిన దగ్గరనుంచీ చూస్తే,  ఎందుకు రోజూ వార్తలలో ఎక్కడ చూసినా అందరూ చీపుర్లతో ఫొటోలకి ఫొజులు .చూస్తే ఒకటే కంపు, ప్రయాణప్రాంగణమంతా  చిరుతిళ్ళ కవర్లతో, వదిలివేసిన అన్నాలు ఎంత అసహ్యంగా ఉందో.కొంచెంసేపు అక్కడ గడిపితే రోగలు రావడం కాయం అనిపించింది. పాపం మోది గారు ఒక్కరే 'స్వచ్ భారట్ అని అనుకుంటే చాలదుగా, ఎవరికివారు మనము, మనచుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలనే అనుకోవాలిగా. రోగాలువస్తే దవాఖానాలకి డబ్బులు తగలుబెడతారు.కాని అవి రాకుండా చూసుకునేప్రయత్నాలు చేయరు. ఎలా అండి, ప్రపంచం ఎంతవేగంగా దూసుకుపోతుందో చూస్తూ కూడా, ఒకరు ఒకరికి శుభ్రత గురించి చెప్పాలా? మొదట ఇంటినుండే స్వచ్ భారత్ మొదలు కావాలి. ఇల్లాలుగా ఇంటిని,ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే అది ఇంటిల్లపాదికి అబ్బుతది, దాని విలువతెలుస్తుంది. సమాజంలో ఆ అవగాహన రావాలి. ఇప్పటివరకూ వచ్చిన ,ఏలిన పాలకులని బియ్యమని, పప్పూని, ఉప్పని అడిగారేగానీ, మాకు మంచి శుభ్రమైన పరిసరాలు కావాలి అందుకు కావాలంటే మేము సహకరిస్తామని ఎవరైనా అడిగారా? పాలకులు కూడా వాటితోనే పొద్దుపుచ్చి వారి కాలం గడిపేస్తున్నారు. అవునా, కాదా? ఇప్పుడు అసలు మనం ఆరొగ్యంగా ఉంతేనేకదా ఉప్పులు,పప్పులు,కొంపలు,గోళ్ళు. ఆ విషయాన్నే మోదీ  సాబ్ గుర్తించారు. కనీసం ఆయన కొత్తగ ఆలోచించినందుకైనా కొంతలోకొంతైనా పాటించుదామని అటు నాయకులలో కలగటంలేదు, ఇటు ప్రజలలో కలగటంలేదు. ఎక్కడైనా స్తలాలిస్తున్నరంట,చీరలిస్తున్నారంట అంటే పరుగులు పెడతారు. పైరవీలు చేసైనా సాదిస్తారు. కానీ మనకోసం, మన కుటుంబ సంక్షేమంకోసం పరిసరాలని శుభ్రంగా ఉంచుకోలేరు. ఈ కాలంలో కూడా దీన్ని ఒక సంక్షేమ కార్యక్రమంలా ప్రకటించాల్సివచ్చినందుకు సిగ్గుపడాలి. టివిలలో ప్రకటనలు చూస్తున్నాం. విదేశీయులు మనదేశంలో ఎదుర్కునే అనుభవాలతోకూడినవి. అవన్నీ వాస్తవాలు కాదా? ఇంకా ఎన్నాళ్ళు? ఇంటికొకరైనా విదేశాలలో ఉంటున్నరోజులలోకూడా ఇలాటి స్థితిలోనే ఇంకా మన దేశముండటం మనదౌర్భగ్యమనుకోవాలా? బహిరంగంగా మూత్రవిసర్జన చట్టరీత్యా నేరంగా పరిగణించి పెనాలిటి అదే ప్రదేశంలో కట్టించుకోవాలి. ఎన్ని సౌకర్యాలు కలిపించినా వాటిని వాడని మనంత మూర్కులు మరెక్కడ ఉండరు.బహిరంగ ధూమపానం, మద్యం సేవించి డ్రైవింగే కాదు ప్రయాణంలు కూద శిక్షలకింద పరిగణించాలి.మొన్న అన్నవరం వెళ్ళాకదా నేను వెళ్ళే బస్లోనే ఇద్దరు తాగి ప్రయాణం చేసారు. ఏమనుకోవాలి. అల్లాంటివారితో కలసి ప్రయాణం ఎంత అసౌకర్యంగా ఉంటుందో ఆలోచించండి.విజయవాడ ఊరుఊరంతా యూరినల్స్ వాసనతో చాలా సిగ్గనిపించిందనుకోండి.ఇదా స్వర్ణాంద్రప్రదెశ్ రాజధాని అని అనిపించింది. పాలకులేకాదు ప్రజలుకూడా ఆలోచించాలి. అది పౌరులుగా అందరం గుర్తెరిగి ఇకనైనా బాద్యతగా మసలుకోవాలని మసలుకుంటారని నా ఈ బ్లాగ్ ద్వారా అందరిని కోరుతున్నా. మనము మనంపుట్టినఊరికి మంచి చేయకపోయినా పరవాలేదు ,కానీ విద్యలవాడ విజయవాడ పేరు చెడగొట్టవద్దని మనవిచేస్తున్నా.  సహ్రుదయంతో ఆలోచించి సహకరించగలరు.               

No comments:

Post a Comment